మా సంతాయిపేట సిగ లో వెలసిన స్వయంభూ శ్రీ భీమేశ్వర ఆలయ పరిరక్షణకు గ్రామ ప్రజలు కమిటీగా ఏర్పడి దేవస్థానం వద్ద సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దేవస్థానం వద్ద సంవత్సరానికి రెండు సార్లు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అవి 1. మాఘ అమావాస్య 2. మహా శివరాత్రి.
ప్రతి ఏటా మాఘ అమావాస్య మరియు మహా శివరాత్రి నాడు ఘనంగా జరిగే ఆలయ ఉత్సవాలకు ఎక్కడెక్కడి నుండో లక్షలాది మంది భక్తులు శివ పార్వతులను దర్శించుకొని తరిస్తారు. మాఘ అమావాస్య కు ఉత్సవాలు ఒక రోజు జరుగుతాయి. మహా శివరాత్రికి మాత్రం మూడు రోజులు ఉత్సవాలతో పాటు శివ పార్వతుల కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవానికి స్వయంభూ శ్రీ భీమేశ్వరాలయ పరిరక్షణ కమిటి భక్తుల సౌకర్యార్థం ఆన్నదాన కార్యక్రమం జరిపిస్తారు.
శ్రీ భీమేశ్వరాలయ పరిరక్షణ కమిటి:
సర్వ శ్రీ
దర్పల్లి మహిపాల్ రెడ్డి (పాపి రెడ్డి), అధ్యక్షులు
మద్దికుంట సిద్దయ్య, ఉపాధ్యక్షులు
శాకాట్ల కిష్టయ్య, ఉపాధ్యక్షులు
ముచ్చర్ల కృష్ణమూర్తి, కోశాధికారి
శ్రీ భీమేశ్వరాలయ పరిరక్షణ కమిటి సభ్యులు మరియు సంతాయిపేట గ్రామ ప్రజలు.
భీమసేన ఫెడరేషన్ (BSF) అనేది మా గ్రామ దేవస్థానం స్వయంభూ శ్రీ భీమేశ్వరాలయం పేరు మీద ఎటువంటి లాభాపేక్ష లేకుండా రాజకీయాలకు అతీతంగా సంతాయిపేట గ్రామ యువత నెలకొల్పిన ఒక స్వచ్చంద సంస్థ. కొంత మంది గ్రామ యువత కలిసి నెలకు కొంత డబ్బులను పోగు చేసి ఏర్పడిన మూల ధనాన్ని గ్రామంలో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు. ప్రతి సంవత్సరం స్వయంభూ శ్రీ భీమేశ్వరాలయం వద్ద జరిగే మాఘ అమావాస్య మరియు మహా శివరాత్రి ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు చల్లని త్రాగు నీటిని పంపిణీ చేస్తారు.
భీమసేన ఫెడరేషన్ (BSF) వారు నిర్వహించిన కార్యక్రమాలు:
ప్రతి సంవత్సరం స్వయంభూ శ్రీ భీమేశ్వరాలయం వద్ద జరిగే మాఘ అమావాస్య మరియు మహా శివరాత్రి ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు చల్లని త్రాగు నీటి పంపిణి.
స్వయంభూ శ్రీ భీమేశ్వరాలయానికి మరియు సంతాయిపేట గ్రామానికి దారిని తెలిపే బోర్డుల ఏర్పాటు.
ప్రతి సంవత్సరం మా గ్రామ ప్రభుత్వ ప్రాథమీకోన్నత పాఠశాల నందు జరిగే స్వాతంత్ర్య దినోత్సవ మరియు గణతంత్ర్య దినోత్సవ వేడుకలకు విధ్యార్థిని విధ్యార్థులకు ఉపాధ్యాయులు నిర్వహించిన ఆటల పోటీలకు బహుమతులను అందజేయటం.
గ్రామంలో అకాల మరణం చెందిన పేదల దహన సంస్కారాలకు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం.
గ్రామం లో గల శ్రీ హనుమాన్ దేవాలయ పునర్నిర్మాణానికి విరాళం.
ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడానికి విరాళం.
గ్రామ ప్రజల సౌకర్యార్థం గ్రామంలో 5 రకాల తెలుగు వార్తా పత్రికలను వేయించడం.
సర్వ శ్రీ
పులి ప్రశాంత్ గౌడ్, అధ్యక్షులు
దర్పల్లి జైపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు
వడ్ల నరేందర్, కోశాధికారి
సుతారి నాగరాజు, కార్యదర్శి
ప్రధాన సలహాదారులు, సలహాదారులు మరియు సభ్యులు
కోటగిరి శ్రీకాంత్
కోటగిరి రాజు (నాగరాజు)
ముచ్చర్ల శశికాంత్ (విక్రమ్)
కొండల రవి గౌడ్
కమ్మరి సుమన్
కుమ్మరి సత్యనారాయణ
కమ్మరి స్వామి
శివన్నగారి సంతోష్ రెడ్డి